గొంతునొప్పి రావడం సహజమే.. డాక్టర్ కి చూపించడమో.. లేక మందులు కొని వేసుకోవడమో చేస్తుంటాము. అయితే.. సీజన్ మారగానే వచ్చే గొంతునొప్పుల్ని అశ్రద్ధ చేయకూడదు. ప్రతిసారి.. గొంతు నొప్పికి డాక్టర్ చుట్టూ తిరగకుండా.. గొంతునొప్పిని మాయం చేసే కొన్ని గృహవైధ్యాలు తెలుసుకుందాం..
- గొంతునొప్పికి సహజ వైద్యం.. గోరువెచ్చని నీరు తాగడం.. దీంతో పాటుగా.. హెర్బల్ టీ, తాజా కూరలతో చేసిన సూప్ లు ఎక్కవగా సేవించాలి. ఇలాంటి ద్రవ్యాలు సేవించడం వలన, అధికంగా ఏర్పడే ఆమము బయటకు వెళ్ళిపోతుంది.
- వేడి చేసిన నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనే కలిపి సేవించినా గొంతులో ఉపశమనం లబిస్తుంది.
- ఇక.. ఈ చిట్కా మీ అందరికి తెలిసినదే, అయితే, దీన్నిఎవ్వరూ ఆచరించారు.. ఉప్పునీటితో గార్గ్లింగ్… అంటే.. నోరు పుక్కిలించడం. ఇలా రోజుకి రెండు సార్లు చేసినా అద్భుతంగా పనిచేస్తుంది.
- పొద్దున్న లేవగానే.. ఒక స్పూన్ తాజాగా చేసుకున్న అల్లము రసంలో, తేనే ఒక స్పూన్ కలిపి ఈ మిశ్రమాన్ని సేవిస్తే.. గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.. గొంతు బుంగర తగ్గి ఉపశమనం చేకూరుతుంది.
- ప్రకృతి ఔషధాలలో వెల్లుల్లి కూడా ఒకటి. పరగడపునే పచ్చి వెల్లుల్లిని దంచి తినాలి.. ఇలా తినలేని వారు.. కొద్దిగా ఉడకబెట్టి కూడా తీసుకోవచ్చు.. లేదంటే.. కూరల్లో లేక రసంలో కూడా కలిపి వండుకొని తీసుకొంటే.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.
- తులసి రసం రోజుకి రెండు మూడు సార్లు ఒక చంచాడు తీసుకుంటే కూడా మంచి లాభం చేకూరుతుంది.
- ఆమము కలుగచేసే పాలు, చల్లని పరుగు నిషేదించడం మంచిది. కారము పదార్ధాలు.. బిస్కెట్స్, చాక్లెట్స్, పూర్తిగా మానెయ్యాలి. గొంతునొప్పి ఉండగా ఇవి తింటే.. మరింత వ్యాధిని పెంచుతాయని గ్రహించాలి.
- ఇక మగవాళ్ళు మద్యం, ధూమపానం, కాఫీలకు దూరంగా ఉంటే ఎంతో ఆరోగ్యకరం. ఊపిరితిత్తులకి ఈ సమయంలో కొంత విశ్రాంతి అవసరం.. కాబట్టి వీటికి దూరంగా ఉండండి.
- ఇక చివరగా ఎంత తక్కువగా మాట్లాడితే అంత త్వరగా గొంతునొప్పి నుండి కోలుకంటారు. ఎక్కువగా అరవకుండా.. నెమ్మదిగా మాట్లాడటం, గొంతుకు కావలసినంత విశ్రాంతి ఇస్తే.. కేవలం కొద్ది రోజుల్లోనే గొంతునొప్పిని మాయం చేసుకోవచ్చు.
- వీటన్నిటితో పాటుగా.. విటమిన్ సి నిండి ఉండే పండ్లను కూడా తింటే.. ఇమ్మ్యూనిటీ పెరిగి.. ఇలాంటి ఇబ్బందులను.. తక్కువగా ఎదురుకుంటారు.