Beauty Tips For Women in Telugu Health Tips for Women

చాలా మందికి తెలియని 12 ఆరోగ్య సూత్రాలు ఇవే.

ఆరోగ్యకరమైన జీవితానికి పురాతన కాలం నాటి 12 ఆరోగ్య సూత్రాలు గురించి తెలుసుకోండి. కనీసం అందులో ఒకటి పాటించిన జీవితంలో 70శాతం రోగాలను తగ్గించుకోవచ్చు. ఇవన్నీ రూపాయి ఖర్చు లేకుండా మన ఆరోగ్యాన్ని ఆయుష్షును పెంచేవి. అవి.

1) అజీర్ణే భోజనం విషం, అజీర్ణే భేషజ వారి: మనం తిన్న తిండి పూర్తిగా అడగకుండా ఎప్పుడు తినకూడదు. తిన్న ఆహారం జీర్ణం కాకుండా మళ్ళీ తినడం వల్ల అజీర్ణం ఏర్పడుతుంది. అలాగే అజీర్ణం ఉన్నప్పుడు మంచి నీరు కొద్దిగా తాగడం వలన అది అమృతంలా పనిచేసి ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.

2) అర్థ రోగ హరి నిద్ర: నిద్ర వలన సగం జబ్బులు తగ్గిపోతాయి అనేది మన పూర్వీకుల మాట. కనీసం రోజుకు ఆరు గంటలు నిద్ర వలన శరీరానికి తగిన విశ్రాంతి లభించి తనను తాను రిపేర్ చేసుకుంటుంది.మనం వాడే సెల్ఫోన్లు టీవీ ల ఎల్ ఈ డి లైట్స్ వలన నిద్రకు భంగం వాటిల్లకుండా పడుకోవడానికి గంట ముందు నుంచి  దూరంగా ఉండాలి. ఒక పది నిమిషాలు గట్టిగా ఊపిరి తీసి వదలడం వల్ల మంచిగా నిద్ర పడుతుంది.

3) న వైద్యః ప్రభురాయుషః : జీవిత కాలాన్ని పెంచే శక్తి వైద్యుల చేతిలో లేదు అనేది ఈ స్తోత్రం యొక్క అర్థం. ఆ శక్తి మన చేతుల్లో మాత్రమే ఉంది. మనం మన ఆరోగ్యం గురించి తీసుకునే శ్రద్ధ మన ఆయుష్షును పెంచుతుంది.

4) చింతావ్యాధి ప్రకాశయా : చింతల వ్యాధులను పెంచుతాయి అనేది స్తోత్రం యొక్క అర్థం. అందుకే ఆందోళనకు దూరంగా ఉండాలి.

5) అజవత్ చర్వణం కుర్యాత్ః : ఆహారాన్ని మేకల బాగా నమలాలి అనేది ఈ సూత్రం యొక్క అర్థం. తిన్న ఆహారం 70శాతం నోట్లోనే జీర్ణం అయ్యేలా 20 నుండి 36 సార్లు నమలాలి.

6) స్నానం నామ మనఃప్రసాదనకరం దుస్వప్న విధ్వసనం : స్నానం మనఃశ్శాంతిని అందించి పీడకలలు నిరోధించగలదు. నిద్రలేమి మానసిక ఆందోళన ఉన్నవారు స్నానం చేయడం వలన మనం పొందవచ్చు.

7) న స్నానం ఆచరేత్ భుక్త్వా : ఆహారం తిన్న తర్వాత ఎప్పుడు స్నానం చేయకూడదు. అది అజీర్ణానికి దారితీస్తుంది, రక్తప్రసరణకు ఆటంకం ఏర్పరుస్తుంది.

8) సర్వత్రా నూతనంశాస్త్రం సేవకాన్న పురాతనం: తినే ఆహారం చేసే పని ఎప్పుడూ తాజాగా ఉండాలి అనేది ఈ శాస్త్రం అర్థం. ఫ్రిజ్ లో పెట్టిన కూరలు, జాడీల్లో దాచే పచ్చళ్ళు తినడం వలన ఆరోగ్యానికి మంచిది కాదు. కూరగాయలు వారాల తరబడి నిల్వ ఉంచకుండా తాజాగా తెచ్చుకొని వాడుకోవాలి.

9) నిత్యం సర్వారసాభ్యాసం : రోజూ తీసుకునే ఆహారంలో షడ్రుచులను ఎంతో కొంత మొత్తంలో తప్పకుండా తీసుకోవాలి. చేదును కూడా తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి.

10) జఠరం పూరమేదర్థం అన్నహి : భోజనం సమయంలో కడుపులో అర్ధ భాగం మాత్రమే నింపాలి. రసం, సాంబార్ వంటి ద్రవ్యాలతో నింపాలి. మరొక పావు భాగం ఖాళీగా ఉంచుకోవాలి.

11) చింతా జరానాం మనుష్యాణం : ఆందోళనలు మనుషులను త్వరగా ముసలి వారిగా మార్చేస్తాయి. అందుకే వీలైనంత ఆందోళనలకు దూరంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.

12)శతం విహాయ భోక్తవ్యం : వంట పనులు ఉన్నా సమయానికి భోజనం చేయాలి. సమయానికి మించి తినడం వల్ల అనారోగ్య సమస్యలు బారిన పడే అవకాశం ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!