శరీరంలో రక్తం తక్కువగా ఉంటే అది అనేక రకాల అనారోగ్యాలకు, జుట్టు రాలిపోవడానికి, చర్మం పాలిపోవడానికి కారణం అవుతుంది. అలాంటప్పుడు మనం తీసుకునే ఆహారంలో రక్తాన్ని పెంచే ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాలను భాగం చేసుకోవాలి. అలాంటి ఒక ఆహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో రక్తం శాతం పెరగడానికి జుట్టు రాలిపోవడం అరికట్టడానికి ఒక లడ్డూని తయారు చేసుకుందాం.
దాని కోసం మనం హలీం విత్తనాలు అనే పోషకాల యొక్క చిన్న నిధిలాంటి ఈ చిన్న విత్తనాలను తీసుకోవాలి. ఈ విత్తనాలు బరువు తగ్గడానికి మరియు రోగనిరోధక శక్తిని పొందడంలో మీకు సహాయపడతాయి. అవి చూడడానికి నువ్వుల్లా ఉన్నా నీటిలో నానబెట్టినప్పుడు సబ్జా గింజలు వలె ఉబ్బుతాయి.
వీటిని 100 గ్రాములు తీసుకొని అవి మునిగేంత వరకు నీటిని పోసి మూడు గంటల పాటు నానబెట్టాలి. ఈ మూడు గంటల్లో ఈ విత్తనాలు నీటిని పీల్చుకుని ఉబ్బుతాయి. తర్వాత స్టౌ పై రెండు వందల గ్రాముల బెల్లం పెట్టుకొని అది కరిగేందుకు రెండు స్పూన్ల నీటిని వేసుకోవాలి.
బెల్లం కరిగేంతవరకు ఉంచి ఒక గరిటెడు నెయ్యి వేసుకోవాలి. బెల్లం బాగా కరిగి బుడగలు వస్తున్నప్పుడు నానబెట్టుకున్న హలీం విత్తనాలను ఇందులో వేసుకోవాలి. వీటిని మాడిపోకుండా చిన్న మంటపై కలుపుతూ ఉండాలి. ఇందులో ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా దగ్గరయి గా న్నె నుండి విడిగా అవుతున్నప్పుడు ఒక ప్లేట్కు నెయ్యి రాసుకొని అందులో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి.
ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి. తర్వాత వీటిని రోజూ ఒకటి తీసుకోవడం వలన శరీరంలో రక్తం పెరగడం, ముఖం కాంతివంతంగా తయారుకావడం, జుట్టు సమస్యలు తగ్గడం వంటివి మీరు గమనిస్తారు. ఈ విత్తనాలకు రక్తహీనతను తగ్గించడంతో పాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
హలీమ్ విత్తనాలు బాలింతలలో రొమ్ము పాలు ఉత్పత్తిని పెంచుతుంది. అవి రుతుస్రావాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. హలీమ్ విత్తనాలు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మరియు హలీమ్ విత్తనాలు మలబద్ధకాన్ని తొలగిస్తాయి.