పండగ సీజన్లో ఎవరొకరి ఇంటికి వెళ్లడం లేదా మన ఇంటికి ఎవరొకరు రావడం జరుగుతుంది. ఆ సమయంలో ప్రత్యేకంగా కనిపించడం కోసం పార్లర్ కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి ఫేసియల్ చేయించుకుంటాము. అంత ఖర్చు పెట్టనవసరం లేకుండా కేవలం ఇంట్లో ఉండే వాటితోనే మీరు అందంగా మారిపోవచ్చు. దీనికోసం ముందుగా మనం బాగా పండిన మీడియం సైజు అరటిపండు తీసుకుని రెండు వైపులా అంచులను కట్ చేసుకోవాలి. తర్వాత అరటి పండుని మూడు ముక్కలుగా కట్ చేసుకువాలి.
ఒక ఒక తీసుకొని మెత్తగా చేసి దానికి పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. తర్వాత మరొక అరటిపండు ముక్క తీసుకుని మెత్తగా చేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక చెంచా అలోవెరా జెల్ వేసి బాగా కలుపుకోవాలి. అలోవెరా జెల్ మార్కెట్లో దొరికే ఏదైనా లేదా చెట్టు నుంచి తీసుకుని జెల్ అయినా సరే ఉపయోగించుకోవచ్చు.
ఈ పేస్ట్ను ముఖంపై ఐదు ఐదు నుంచి పది నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ పోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి కూడా పోతుంది. మసాజ్ అయిపోయిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. తర్వాత మూడవ స్టెప్ మనం మూడు ముక్కలుగా కట్ చేసుకున్న బాణాలు మూడవ అక్కను కూడా తీసుకుని మెత్తగా చేసి ఒక చెంచా శెనగపిండి వేసుకోవాలి. శెనగపిండి బదులుగా ముల్తానీ మట్టి లేదా గంధంపొడి లేదా బియ్యప్పిండిని కూడా ఉపయోగించుకోవచ్చు.
కొంచెం తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఒక చెంచా పెరుగు వేసుకోవాలి. ఈ పేస్ ప్యాక్ బాగా కలిపి ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ముందు 2 మసాజ్, స్క్రబ్బింగ్ చేసిన చేయకపోయినా ఫేస్ ప్యాక్ మాత్రం వేసుకోండి. మాకు సమయం లేదు కానీ అందంగా కనిపించాలి అనుకున్నవారు ఈ ప్యాక్ ఒకసారి ట్రై చేయండి. మంచి రిజల్ట్ ఉంటుంది. పార్లర్కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టనవసరం లేకుండా ఇంట్లోనే ఉండే పదార్థాలుతో ఈ ప్యాక్ ట్రై చేసినట్లయితే ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.