మన శరీరంలో తినే ఆహారాన్ని వడకట్టి విషపదార్థాలు బయటకు పంపాలంటె కిడ్నీలు చాలా అవసరం. అలాంటి కిడ్నీలలో పేరుకుపోయే టాక్సిన్లు, విషవ్యర్థాలను బయటకు పంపకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే కిడ్నీలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలకు ప్రమాదం వస్తే కనిపించే లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దానివలన కిడ్నీలు ప్రమాదంలో పడకుండా కాపాడుకోగలం. కిడ్నిలు ప్రమాదంలో ఉంటే కనిపించే పది ముఖ్యమైన లక్షణాలేంటో చూద్దాం. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎప్పుడూ నీరసంగా ఉంటారు. ఏ పని చేయాలన్నా నిస్సత్తువ, బలహీనంగా ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉంటే మన శరీరం విటమిన్ డి ని గ్రహించలేదు. దీనివలన ఎడినాయిడ్స్ అనే హార్మోన్ విడుదలవదు.మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
దానివలన ఎర్రరక్తకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో రక్తహీనత వస్తుంది. దాంతో కండరాలు, మెదడు బలహీనంగా మారిపోయి నిస్సత్తువ, అలసట అనిపిస్తుంది. రోజువారీ మనం తీసుకునే నీటివలన మన మూత్రపిండాలు, మూత్రం ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం లేదని మూత్రాన్ని బట్టి తెలుస్తుంది. మూత్రపిండాలు ఆరోగ్యంగా పనిచేయకపోతే మూత్రం రంగు మారుతుంది.
మూత్రం పసుపు రంగులో ఉన్నా మూత్రంలో రక్తం పడినా మూత్రంలో నలుపు, నారింజ, గోధుమరంగులో వస్తున్నా మూత్రపిండాలు సరిగా లేవని అర్థం. మూత్రపిండాలు ప్రమాదంలో ఉన్నవారిలో తరచూ కడుపునొప్పి వస్తుంది. నోటిలో పూత వస్తున్నా కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్టె. కళ్ళవాపులు, నిద్రలేమి సమస్య కూడా తరచూ ఏర్పడతాయి. చర్మంపై దద్దుర్లు, పొడిబారడం కూడా ఉంటుంది. అంతేకాకుండా కిడ్నీలు ఉండేచోట ఎవరో పొడిచినట్టు అనిపిస్తుంది.
అలాగే కాళ్ళలో దురదలు, నొప్పులు వస్తున్నా కిడ్నీ సమస్యలు ఉన్నట్టే. నాలుక రుచిని చూసే లక్షణం తగ్గిపోతుంటుంది. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో వ్యర్థపదార్థాలు అలాగే ఉండిపోతాయి. బయటకు వెళ్ళకపోవడం వలన ఆ వ్యర్థ ద్రవాలు శరీరమంతా వ్యాపించి శరీరం వాచినట్టు ఉంటుంది. కిడ్నీలు పాడయితే కాళ్ళు, చేతులు వాపులు వచ్చి లావుగా ఉబ్బినట్టు ఉంటాయి.
ఇలాంటి సమస్యలు ఉన్నవారు కిడ్నీలను పరీక్షించుకోవాలి. ఇలాంటి సమస్యలు ఉన్నవారికి రక్తప్రసరణ తగ్గిపోతుంది. గుండె, ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుంది. ఈ లక్షణాలలో ఏవి కనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించి కిడ్నీ పరీక్షలు చేయించుకోండి.