మన శరీరంలో చాలా రకాలైన అనారోగ్య సమస్యలు ఉంటాయి వాటిలో కిడ్నీలో రాళ్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం చాలామంది కిడ్నీలో రాళ్లు వలన బాధపడుతున్నారు మన శరీరంలో చాలా వరకు మలినాలను బయటకు పంపే పని చేసేది కిడ్నీలు. మన రక్తంలో ఎక్కువగాఉండే వాటర్ ని అలాగే రక్తంలో ఉండే మలినాలను శుభ్రం చేసి కిడ్నీలు బయటకు పంపిస్తాయి. ప్రస్తుత కాలంలో మనిషి ఏ కారణం చేతనైనా కావలసినంత వాటర్ ని తీసుకోలేకపోతున్నారు. చాలామంది సమయానికి తినకపోవడం, కావలసినవి తినకపోవడం ఇంకా స్థూలకాయంతో బాధపడుతున్న వారు కావలసినవి తినకపోవడం వల్ల లవణాలు స్పటిక రూపంలో ఏర్పడి స్టోన్స్గా మారుతున్నాయి.
చాలా మందిలో స్టోన్స్ చిన్న ఇసుకరేణువులుగా ఏర్పడి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. చాలా తక్కువ మందిలో మాత్రమే రాళ్ళు ఏర్పడతాయి. రాళ్లు పెద్దగా ఏర్పడి అవి బయటకు రావడానికి ఇబ్బంది పడి కిడ్నీలో నొప్పి కలగజేస్తాయి. ఎలాంటి ఆపరేషన్ చేయించుకోకుండా ఇటువంటి వైద్య చికిత్స తీసుకోకుండా వీటితో రాళ్లను బయటకు వచ్చేలా చేయొచ్చు. దీనికి వారికి కావాల్సినవి సొరకాయ గింజలు. సొరకాయ గింజలు కిడ్నీలో రాళ్లను ఈజీగా బయటకు తీసుకు వచ్చే శక్తిని కలిగి ఉంటాయి.
సొరకాయలు కాల్షియం, పాస్పరస్, సోడియం, విటమిన్ సి, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. సొరకాయలో ఫైబర్ ఎక్కువగా కేలరీలు తక్కువగా ఉంటాయి. సొర కాయ శరీరానికి చల్లదనాన్ని బాగా ఇస్తుంది. సొరకాయ డయూరిక్ బాగా పనిచేస్తుంది. ఇలా డయూరిక్ గా పని చేయడం వల్ల మూత్రనాళ సమస్యలు క్లియర్ చేస్తుంది కిడ్నీ స్టోన్స్ ను కరిగించడానికి బాగా సహాయపడుతుంది. దీనికి సొరకాయ లో ఉండే విత్తనాలను ఎండబెట్టుకుని మెత్తటి పొడి లాగా చేసుకోవాలి.
లేదంటే ఆయుర్వేదిక్ షాప్ లో సొరకాయ పొడి అని దొరుకుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తీసుకుని దానిలో ఒక స్పూన్ తేనె కలుపుకోవాలి. డయాబెటిస్ బ్లడ్ షుగర్ తో బాధపడేవారు తేనే అవాయిడ్ చేయండి. ఇలాంటి సమస్య ఉన్న వాళ్లు తేనె బదులుగా సైంధవ లవణాన్ని కలుపుకోవాలి. దీనిలో ఒక స్పూన్ సొరకాయ గింజల పొడిని కలుపుకోవాలి. ఈ వాటర్ డయాలసిస్ చేయించుకున్న వారికి కూడా ఉపయోగపడుతుంది.
ఇలా తయారు చేసుకున్న డ్రింక్ ఉదయాన్నే ఖాళీ కడుపున తీసుకోవాలి. తీసుకున్న మూడు నాలుగు రోజుల్లోనే ఫలితాన్ని చూడొచ్చు. రాళ్లు వెంటనే పడిపోతాయి. దీంతోపాటు మెంతులు నానబెట్టుకుని వాటర్ తీసుకుంటే కనుక కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. కిడ్నీలో రాళ్లు ఉన్న వాళ్ళు టమాటో, చాక్లెట్, సోయా, చిక్కుడు ఇలాంటి ఆహారం తీసుకోకూడదు. తీసుకోవడం వల్ల కిడ్నీ లో రాళ్ళు ఎక్కువ అవుతాయి. క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం కిడ్నీలో రాళ్లు లేకుండా చేస్తుంది. కాబట్టి ఇటువంటి ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఈ టిప్స్ మీ కిడ్నీలో రాళ్ళను కరిగిపోయేలా చేస్తాయి.