ఉదయాన్నే ఏదో ఒకటి అల్పాహారంగా తీసుకోవడం తప్పనిసరి. కానీ అల్పాహారం కోసం ఉప్మాలు లేదా ఇడ్లీలు అంటూ మనం తీసుకునే ఇప్పటి టిఫిన్లు ఆరోగ్యకరం కాదు అని అంటున్నారు నేచురోపతి డాక్టర్లు. ఆయిల్ తో నిండిన పూరీలు, బజ్జీలు వంటివి తినడం వలన అనారోగ్యం పాలవుతారు అని చెబుతున్నారు. మినపప్పు గుండు పప్పు కాకుండా పొట్టు మినపప్పు తీసుకుని సగం పొట్టు ఉండేలా కడిగి ఇడ్లీ రవ్వలకు బదులు కొర్రలతో చేసిన ఇడ్లీలు, చిరుధాన్యాలను ఉపయోగించి అనేక రకాల అల్పాహారాలు తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు.
ఇవి ఉదయాన్నే శరీరానికి అధిక శక్తి ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. అసలు లేచిన వెంటనే ఒక లీటర్ నీటిని తాగాలి. ఇవి గోరువెచ్చని నీరు అయితే మరీ మంచిది. తర్వాత వీలైనంత పండ్లు, మొలకలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. అలాగే మధ్యాహ్నం ఆహారంలో అన్నానికి రెండు రెట్ల కూరలు తీసుకోవాలి. ఏ కూరగాయలు, ఆకుకూరలు అయినా సరే ఉప్పు కారాలు తగ్గించి అన్నం కంటే ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. అలాగే నాన్వెజ్ మూడునెలల పాటు మానేయవచ్చు.
సాయంత్రం పూట మన ఎంత అయితే ఆహారం తీసుకుంటామో అంతే మొత్తంలో పండ్లను ఆహారంగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో అనేక రకాల వ్యాధులు వాటంతట అవే తగ్గిపోతాయి. వీటితో పాటు రోజుకి నాలుగు నుండి ఐదు లీటర్ల నీటిని తాగాలి. రోజుకి రెండు రకాల పండ్ల రసాలు తీసుకోవాలి. వాటితో పాటు కూరగాయల జ్యూస్లు కూడా తీసుకోవచ్చు. ఉదయాన్నే పుదీనా- కొత్తిమీర కలిపిన జ్యూస్, క్యారెట్ – బీట్రూట్ కలిపిన జ్యూస్, పాలకూర – కరివేపాకు, మునగాకు – కరివేపాకు ఇలాంటి జ్యూసులను తీసుకోవచ్చు.
లేత సొరకాయ, బీరకాయ, టమాటా కలిపిన మిక్సిడ్ వెజిటేబుల్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ శరీరానికి కావలసిన పోషకాలను అందించి శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.శరీరంలో పేరుకున్న విషవ్యర్థాలను బయటకు పంపి ఇప్పుడు చెప్పిన డైట్ పాటిస్తూ ఆర్థరైటిస్, డయాబెటిస్, బీపీ వంటి అనేక రకాల అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు.