ప్రియమైన భోజన ప్రియులారా.. ఈరోజు మనం రాయలసీమ స్టైల్ లో పల్లీలు పచ్చిమిర్చి టమాటా పచ్చడి. ఆల్ ఇన్ వన్ చెట్నీ అని చెప్పుకోవచ్చు రాగి సంగటి ఇ అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినవచ్చు. పూరి చపాతీ ఇడ్లీ దోసె ఎందులోకైనా చాలా సూపర్ గా ఉంటుంది.
పల్లి పచ్చిమిర్చి టమోటో పచ్చడి కి కావలసిన పదార్థాలు
- పల్లీలు ఒక కప్పు
- ఇరవై పచ్చిమిరపకాయలు
- రెండు ఉల్లిపాయలు
- చింతపండు కొద్దిగా
- కొత్తిమీర కొద్దిగా
- మూడు టమోటోలు
తయారీ విధానం
- గ్యాస్ వెలిగించుకొని దాని మీద కడాయి పెట్టుకుని పల్లీలు వేసి వేయించండి. చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె వేయండి. ఇందులో పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇందులో వేసి కొద్దిగా ఫ్రై చేయండి. వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి.
- కడాయిలో కొద్దిగా నూనె వేసి టమోటోలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి కొద్దిగా ఫ్రై చేయండి. తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా వేసి వేయించండి.
- ఓక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి మిరపకాయలు, చింతపండు, కొద్దిగా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న పల్లీలను వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయండి.
- చివరిగా ఇందులో మగ్గిన టమోటాలను కొత్తిమీరను వేసి గ్రైండ్ చేయండి.
- తర్వాత ఇందులో ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసి కలపండి. తర్వాత మిక్సీ ని ఒక రెండు సెకండ్స్ గ్రేడ్ చేయండి. మీరు కావాలనుకుంటే ఉల్లిపాయలను కూడా ఫ్రై చేసి కలుపుకోవచ్చు.

మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటలు తెలుసుకోవడానికి మా పేజీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి